పల్లె పండగ 2.0తో గ్రామాల రూపురేఖలు మార్చేయాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

  • పల్లె పండగ 2.0 కార్యక్రమంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష
  • ఏపీ గ్రామీణ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశం
  • తొలి దశ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని సూచన
  • మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమావేశం
  • పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు కీలక దిశానిర్దేశం
ఆంధ్రప్రదేశ్ గ్రామాల ముఖచిత్రాన్ని సంపూర్ణంగా మార్చివేసే లక్ష్యంతో 'పల్లె పండగ 2.0' కార్యక్రమానికి పటిష్ఠమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. తొలి దశలో సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని, రెండో దశ కార్యక్రమాలు అంతకుమించి విజయవంతమయ్యేలా చూడాలని ఆయన స్పష్టం చేశారు.

మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో పవన్ కల్యాణ్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "పల్లె పండగ మొదటి దశ స్ఫూర్తిని కొనసాగిస్తూ, రెండో దశ ప్రణాళికలు రాష్ట్రంలోని పల్లెసీమల రూపురేఖలను సమూలంగా మార్చే విధంగా ఉండాలి" అని దిశానిర్దేశం చేశారు. గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని సూచించారు.

ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణతేజ, ఓఎస్డీ వెంకటకృష్ణ, ఇంజనీరింగ్ చీఫ్ బాలు నాయక్ సహా పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. పల్లె పండగ 2.0 అమలుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో కూలంకషంగా చర్చించారు.

Pawan Kalyan
Palle Panduga 2.0
Andhra Pradesh
Rural Development
Panchayat Raj
Village Development
AP Villages
Shashi Bhushan Kumar
Krishna Teja

More Telugu News